గద్వాల్ పర్యటనలో రామన్న కాన్వాయ్ ప్రయాణం సందర్భంగా ఓ హృదయానికి హత్తుకునే సంఘటన చోటు చేసుకుంది.
సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకెళ్తుండగా, మార్గమధ్యంలో ఉన్న ఓ యువకుడు రామన్నను చూసి ఉత్సాహంగా చేతిని ఊపాడు.
ఆ అభిమానం గమనించిన రామన్న తన వాహనం ఆపించి, ఆ యువకుడిని పలకరిస్తూ “తమ్ముడు బాగున్నావా” అంటూ ఆరా తీశారు.
ముందున్న వాహనంలో రామన్న లేకపోవడంతో, వెనుక వాహనం వరకు పరిగెత్తుకుంటూ చేరిన యువకుడు చివరకు తన మనసులోని అభిమానం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన రామన్నకు యువతలో ఉన్న ఆదరణకు దర్పణంగా నిలిచింది.

