కూసుమంచి మండలం – కల్లూరుగూడెం
ప్రజా ప్రభుత్వ పాలనలో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరుగూడెం సొసైటీ వద్ద ఉదయం నుంచే క్యూల్లో నిలబడి ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.
చెప్పులను క్యూలో పెడుతూ ఒక్క యూరియా బస్తా అయినా దొరుకుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నల ఆవేదన అక్కడ కనిపిస్తోంది.
“వేసిన పంట, పెట్టిన పెట్టుబడి అంతా వృథా అవుతోంది.
ఇందిరమ్మ ప్రభుత్వంలో యూరియా కూడా అందక పంటలు ఎండిపోతున్నాయి” అంటూ రైతులు కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తున్నారు.

