యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీ:
మరణించిన కోడూరు శివారెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అగాపే ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన భార్య లక్ష్మీనారాయణమ్మ, కుమారులు వేణుగోపాల్ రెడ్డి, భాను ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమంలోని నిరాశ్రయులకు భోజనాలు ఏర్పాటు చేసి, స్వయంగా వడ్డించారు.
కార్యక్రమంలో కోడూరు నీలకంఠ, కోడూరు శేఖర్, శ్రేయోభిలాషి యేసయ్య, శీన, అంజి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భం సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుడు బత్తల ప్రసాద్ సహా ఆశ్రమ వాసులు, కుటుంబం చేసిన సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు.

