భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామం:
మానవతను కదిలించే ఘటన చోటుచేసుకుంది.
గర్భిణీ రవ్వ భీమేకి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో, అంబులెన్స్ రాకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లడం ప్రారంభించారు. బుదరలో నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం మోసుకెళ్తుండగా, నొప్పులు మరింతగా పెరగడంతో ఆమె నడిరోడ్డుపైనే ప్రసవించారు.
తర్వాత బిడ్డతో పాటు భీమేను ఆటోలో తరలిస్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్ చేరి వారిని సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.
డాక్టర్లు పరిశీలించిన అనంతరం తల్లి – శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించారు

