మానుకోట
తెలంగాణ ఉద్యమకారుడు భాస్కర్ నాయక్ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఫోన్ ద్వారా పరామర్శించారు.
ఇటీవల భాస్కర్ సోదరుడు, మరొక రైతుతో కలిసి మహబూబాబాద్ జిల్లాలో యూరియా టోకెన్ల కోసం బైక్పై వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరూ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
భాస్కర్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని కవిత సూచించారు. అలాగే, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

