న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన జన్మదినం సందర్భంగా కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ సామాజిక-ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలలో విశేష పురోగతి సాధించిందని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం, వికసిత భారత్ సాధనలో మోదీ సంకల్పం అందరికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. “భారత దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న మోదీ గారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని కిషన్ రెడ్డి అభిలషించారు.

