Tv424x7
National

ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…

న్యూఢిల్లీ:

ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన జన్మదినం సందర్భంగా కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్‌ సామాజిక-ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలలో విశేష పురోగతి సాధించిందని అన్నారు.

ప్రజల సంక్షేమం కోసం, వికసిత భారత్‌ సాధనలో మోదీ సంకల్పం అందరికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. “భారత దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న మోదీ గారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని కిషన్ రెడ్డి అభిలషించారు.

Related posts

నువ్వా నేనా: బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్‌ మహాఘట్‌బంధన్__ ది వైర్ స్టాఫ్!!

TV4-24X7 News

పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్

TV4-24X7 News

రియల్‌మి నుంచి వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

TV4-24X7 News

Leave a Comment