అమరావతి :
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 పరీక్షా విధానంలో పెద్ద మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు రెండు పేపర్లతో నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షను ఇకపై ఒకే పేపర్తో నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త విధానం అమలులోకి వస్తే పరీక్షా ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, పరీక్ష నిర్వహణలో సమయం, వనరుల ఆదా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకొని అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం

