మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కేజీబీవీ లో అక్రమంగా బియ్యం సరఫరా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు విచారణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సివిల్ సప్లై, రెవెన్యూ, విద్యాశాఖ అధికారుల బృందం కేజీబీవీకి చేరుకుని రికార్డులు పరిశీలించారు. అక్రమంగా సరఫరా అవుతున్న బియ్యం వివరాలు సేకరించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠా ఎవరో, బియ్యం ఎక్కడి నుండి తెచ్చారో, ఎలా సరఫరా జరిగిందో దర్యాప్తు కొనసాగుతోంది.

