పిఠాపురం:
సోషల్ మీడియాలో వైరల్ అయిన యూరియా లారీ దారి మళ్లింపు వీడియోలపై అధికారులు తక్షణ స్పందన చూపారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, వన్నెపూడి ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించారు.
ఫలితంగా:
రెండు లారీలు సీజ్ అయ్యాయి.606 యూరియా బస్తాలు స్వాధీనం తీసుకున్నారు.నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.సీజ్ చేసిన లారీలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కు అప్పగించబడ్డాయి. అధికారులు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

