మణిపూర్లో మళ్లీ ఉగ్రవాదుల దాడి జరిగింది.
బేస్ క్యాంప్ వైపు వెళ్తున్న సైన్యం వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అస్సాం రైఫిల్స్కు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.
తమ సహచరులను కోల్పోవడంతో సైనిక దళాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఘటన స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకుని, ఉగ్రవాదుల కోసం విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి.
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నారు.

