జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భద్రతా దళాలు – ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 19న రాత్రి 8 గంటల సమయంలో నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

