మణిపూర్లో సాయుధ బలగాలపై కాల్పులు కలకలం సృష్టించాయి రాజధాని ఇంపాల్ నుంచి బిష్ణుపూర్, వైపు వెళ్తున్న అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై లక్ష్యంగా చేసుకొని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు మరో ఐదుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం.
శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో నింబోల్ సబల్ లైకై ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్కు అసోం రైఫిల్స్ సిబ్బంది ప్రయాణిస్తుండగా వారి వాహనంపై కొందరు సాయుధులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
భద్రతాదళాలపై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విధి నిర్వహణ లో ఉన్న ఇద్దరు వీర జవాన్లు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ల అంకితభావం, త్యాగాలను జాతి మరిచిపోదని అన్నారు.
ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకావా లని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. హింసను ఎంతమాత్రం సహించేది లేదని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పరిరక్షిం చేందుకు తాము.

