విజయవాడ రూరల్ నున్నలో మానవత్వాన్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని, బాబాయ్ వద్ద నివసిస్తున్న ఒక మైనర్ బాలికపై బాబాయ్ కిరాతకంగా అత్యాచారం చేశాడు.అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను చికిత్స నిమిత్తం వైద్యుల దగ్గరకు తీసుకెళ్లగా, ఆమె గర్భవతి అయిందని పరీక్షల్లో బయటపడింది. దీనిపై ఆ బాలిక ధైర్యం చేసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన బాబాయే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది.
📌 పోలీసుల స్పందన:”
బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వైద్య నివేదికలు పొందాం. దర్యాప్తు కొనసాగుతోంది” అని రూరల్ పోలీస్ అధికారులు తెలిపారు.
📌 గ్రామస్తుల ఆవేదన:
“తల్లిదండ్రులు లేరని అనాథలా ఉన్న పిల్లపై ఇలా చేయడం చాలా పాశవికం. అతనికి కఠిన శిక్ష విధించాలి. ఇటువంటి ఘటనలు మరల జరగకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
📌 మహిళా సంఘాల స్పందన:
“ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో సమాజం కలచివేస్తోంది. చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థలు అవసరం. నిందితుడికి వేగవంతమైన న్యాయం జరగాలి” అని మహిళా సంఘ నాయకురాలు డిమాండ్ చేశారు.ఈ ఘటనతో నున్న ప్రాంతం అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

