ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరగనుంది. అనంతరం 9, 10 తేదీల్లో పోస్టింగ్ల కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఇక పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ డీఎస్సీకి ఎంపికైన వారికి ప్రస్తుతం సెలవులు మంజూరు చేయకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారికి పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచే విధుల నుంచి రిలీవ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

