గుంటూరు:
పాయకరావుపేట నియోజకవర్గంలో మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వేంపాడు టోల్ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి అనిత సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, సన్మాన పతకాలు, అలాగే ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా పాయకరావుపేట మండలం PLపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ను మంత్రి స్వయంగా అందజేశారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత వహిస్తారని, పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ, ఈ డీఎస్సీ కోసం మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.

