తిరుపతి: తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అలజడి చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు నగరంలో బాంబులు పెట్టినట్టు హెచ్చరించడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
వెంటనే జిల్లా పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. తిరుమల, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.
ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ సుబ్బరాయుడు భరోసా ఇచ్చారు. “ఇలాంటి బెదిరింపులు పలు రాష్ట్రాల్లో వస్తున్నాయి. తిరుపతికి కూడా అదే తరహా బెదిరింపు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలు వదంతులు నమ్మవద్దు,” అని ఆయన స్పష్టం చేశారు.
పోలీసుల ప్రకారం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే నేడు చెన్నైలో సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.

