విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు – 2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తరఫున స్వచ్ఛ జిల్లా అవార్డు – 2025ను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్వీకరించారు. ఈ అవార్డు జిల్లా ప్రగతిశీల పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాలలో అగ్రస్థానం పొందినందుకు కల్పించబడింది.

