తుని (కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా తునిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నారాయణరావు, పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం, నిందితుడు నారాయణరావును నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, మార్గమధ్యలో ‘బాత్రూంకు వెళ్లాలి’ అని చెప్పి పోలీసుల కళ్లుగప్పి అతడు పరారయ్యాడు.అలా తప్పించుకున్న వెంటనే, సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచే గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదయం నిందితుడు నారాయణరావు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

