మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులు నష్టపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు.
తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

