గడచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్ ప్రస్తుతం మరింత బలపడుతోంది.
ప్రస్తుత స్థానం:
మచిలీపట్నం నుండి – 230 కి.మీ
కాకినాడ నుండి – 310 కి.మీ
విశాఖపట్నం నుండి – 370 కి.మీ
మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.
ఈ రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.
రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
తీరం వెంబడి గంటకు 90–110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు:శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ
మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి.
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు

