Tv424x7
Andhrapradesh

మొంథా తుపాన్ తాజా అప్‌డే

గడచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్ ప్రస్తుతం మరింత బలపడుతోంది.

ప్రస్తుత స్థానం:

మచిలీపట్నం నుండి – 230 కి.మీ

కాకినాడ నుండి – 310 కి.మీ

విశాఖపట్నం నుండి – 370 కి.మీ

మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.

ఈ రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.

రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.

తీరం వెంబడి గంటకు 90–110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది.

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు:శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ

మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి.

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు

Related posts

మృతి చెందిన టీడీపీ నేతలకు ఘననివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి.

TV4-24X7 News

స్పా ముసుగులో వ్యభిచారం బహిర్గతం..

TV4-24X7 News

Leave a Comment