న్యూఢిల్లీ / అమరావతి :దేశవ్యాప్తంగా జరగబోయే 2025 జనగణనకు ముందు ప్రీ-టెస్ట్ దశకు రంగం సిద్ధమైంది. భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర గెజిట్ విడుదల చేసింది.
నవంబర్ 10 నుంచి 30 వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో గృహ లెక్కింపు, గృహ గణన కార్యక్రమాలు జరగనున్నాయి.
అదేవిధంగా నవంబర్ 1 నుంచి 7 వరకు స్వీయ లెక్కింపు (Self Enumeration) సౌకర్యం అందుబాటులో ఉంచనున్నారు.
ఈ ప్రీ-టెస్ట్ ద్వారా రాబోయే జనగణనలో సాంకేతిక విధానాలు, డిజిటల్ సదుపాయాలు, ఫీల్డ్ ప్రాసెస్లను పరిశీలించనున్నారు అధికారులు.

