కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామపంచాయతీకి చెందిన దేవతి దేవేంద్ర మరియు ఆయన భార్య ఎన్నో ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన పాత ఇంటిలో నివసిస్తున్నారు. కాలక్రమేణా ఆ ఇల్లు పూర్తిగా దెబ్బతిని, ఇప్పుడు కూలిపోబోతున్న స్థితికి చేరుకుంది.ఇటీవలి వర్షాల కారణంగా గోడలు చీలి, పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ఈ వృద్ధ దంపతుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. అయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరమ్మత్తు చేయించుకోలేక, అదే ఇంట్లో నివసించక తప్పని పరిస్థితి ఏర్పడింది.గ్రామస్థులు మాట్లాడుతూ –“ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఏ క్షణమైనా ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మరియు అధికారులు వెంటనే స్పందించి, వీరికి పునరావాసం కల్పించి, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలి” అని విజ్ఞప్తి చేశారు.


