Tv424x7
AndhrapradeshNational

అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని ధియోటర్స్ లో ప్రసారం

*ఆంధ్ర ,తెలంగాణ ప్రజానీకానికి శుభవార్త….అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు ముందుకు వచ్చిన మల్టీ ఫ్లెక్స్ సినిమా థియోటర్స్ టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే*దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సోమవారం (జనవరి 22) బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలిరానున్నారు. అలాగే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. మరికొందరు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అయోధ్య రాముడి పండగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్‌. అది కూడా కేవలం 100 రూపాయల టికెట్‌తోనే. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్‌ స్క్రీన్‌పై ఈ మహాక్రతువును వీక్షించవచ్చుఇది సినిమా టిక్కెట్ ధర మాత్రమే కాదు, ఇందులో కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కాంబో కూడా ఉంటుంది. గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌ లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ‘ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా తెలిపారు.కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది.

Related posts

ఏపీలో హైకోర్ట్ సంచలన తీర్పు

TV4-24X7 News

తుమ్మనంగుట్ట టోల్ ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

TV4-24X7 News

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

TV4-24X7 News

Leave a Comment