Tv424x7
Andhrapradesh

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

దిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు..దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు..ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన..ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు..

Related posts

సీపీ చేతుల మీదుగా 2,45,000 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం

TV4-24X7 News

సీనియర్ సిటిజన్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

TV4-24X7 News

అర్చకుల పేరుతో ఘరానా మోసం

TV4-24X7 News

Leave a Comment