Tv424x7
National

అమెరికాలో భారత రాయబారిగా వినయ్‌ క్వాత్రా

అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా నియమితులయ్యారు. ఇదివరకు పనిచేసిన తరణ్‌జిత్‌ సంధు జనవరిలో పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో వినయ్‌ క్వాత్రాను విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం నియమించింది. త్వరలోనే వినయ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎంఈఏ తెలిపింది. 1988లో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా విధుల్లో చేరిన వినయ్‌ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు.

Related posts

తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

TV4-24X7 News

కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి ఎందుకో తెలుసా

TV4-24X7 News

బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్పై జీరో FIR నమోదు

TV4-24X7 News

Leave a Comment