Tv424x7
Andhrapradesh

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి

విశాఖపట్నం మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చాడు. వివరాలిలా ఉన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్ లో ఓ జంట మధ్య తగాదా జరుగుతోంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కనక మహాలక్ష్మి టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫిర్యాదిచ్చింది. దీంతో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ జి.రాజు నాయుడు సంఘటన స్థలానికి వెళ్లాడు. భార్యభర్తల మధ్య తగాదాను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న కనకమహాలక్ష్మి భర్త రాజు.. సదరు కానిస్టేబుల్పై దాడికి దిగాడు. తమ మధ్య జరుగుతున్న తగాదాకు నీవెవరంటూ ప్రశ్నించాడు. కంటిపైనా, మోచేతిపైనా బలంగా కొట్టాడు. మందుబాబు నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా వెంటాడి మరీ దాడి చేశాడు. దీంతో గాయాల్కెన కానిస్టేబుల్ను సహచరులు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts

నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం

TV4-24X7 News

మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగాఓల్టేజ్ హోం లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు

TV4-24X7 News

కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి..రంజిత్ భాషా

TV4-24X7 News

Leave a Comment