Tv424x7
Andhrapradesh

ప్రముఖ సంఘ సేవకురాలు మయాంక్ కుమారి వివేకానంద ఆశ్రమమునకు నిత్యవసరాలు వితరణ

విశాఖపట్నం రోటరీ క్లబ్, విశాఖపట్నం సభ్యులు, ప్రముఖ సంఘ సేవకురాలు మయాంక్. కుమారి, శక్తి విక్రం దేవ్ జ్ఞాపకార్థం వివేకానంద అనాధ ఆశ్రమమునకు అన్నదాన నిమిత్తం 25000/- విలువచేసే 8 బస్తాల బియ్యం, ఆయిల్, చింతపండు, కందిపప్పు, కారం, ఉప్మా రవ్వ, సబ్బులు, పేస్టులు మొదలైన నిత్యవసరాలను అందించారు. ఆమె ఆశ్రమ వాసులతో కొంత సమయం గడిపి వారి యోగక్షేమాలను కనుక్కున్నారు, ఈ నెల 4 వ తేదీన తిరుపతి, అరుణాచలం యాత్రలకు బయలుదేరుతున్నారని తెలుసుకొని చాలా సంతోషించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుల అప్పారావు, మయాంక్. కుమారి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వివేకానంద సంస్థ వారు ప్రతిరోజు నిత్య అన్నదానాలకు, గోషా హాస్పిటల్ లో భోజనాల పంపిణీకి ఇలా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ వినయ్ గాంధీ, సెక్రటరీ మణిమాల, పాల్గొన్నారు.

Related posts

కడప పర్యటనలో కార్యకర్తలకు భరోసా ఇచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

TV4-24X7 News

టీడీపీ అధ్యక్షుడు అమరేంద్ర చేతుల మీదగా జీవీఎంసీ వర్క్స్ కి బట్టలు అందజేత

TV4-24X7 News

Leave a Comment