Tv424x7
Andhrapradesh

ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

కడప /మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారు సంజాయిషీను సమర్పించాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారుమైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు రీ ఎంక్వయిరీ చేసి అక్కడ జరిగిన అవకతవకలు/ తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో ఆ సమయంలో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్ తో పాటు 14 మంది వీఆర్వోలపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు గాను నిర్ణయించి వారి నుండి వివరణ (explanation) సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశామన్నారు. వారి నుండి వివరణ /సంజాయిషీ లు అందిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

3కేజీలు ప్లాస్టిక్ సీజ్ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు

TV4-24X7 News

తిరుమలలో ఈవో తనిఖీలు

TV4-24X7 News

తాడిపత్రిలో హత్య కుట్ర భగ్నం… ఒకరి అరెస్టు… వేట కొడవలి స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment