కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ చేయాలని లేఖలో కోరింది. కేంద్ర, రాష్ట్రానికి చెందిన పలు శాఖల ప్రమేయంపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అంతర్రాష్ట్ర అంశాలపైనా లోతుగా దర్యాప్తు చేసి,బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాళేశ్వరం నివేదికపై దర్యాప్తును సీఎం రేవంత్రెడ్డి సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
previous post

