పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నిషేధిత మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.
ఆలయ పరిసరాల్లో మద్యం, సారా, మత్తు పదార్థాలు నిషేధం ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పట్టుబడిన మద్యం బాటిళ్లను శ్రీశైలం టోల్గేట్ వద్ద పోలీసులు మల్లమ్మ కన్నీరు డంప్యార్డ్కు తరలించి ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు.
సీఐ ప్రసాద్ రావు మాట్లాడుతూ ,ఆలయ పరిధిలో మద్యం సేవించడమే కాకుండా కలిగి ఉండడం కూడా నేరమని,
ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భక్తులు, పర్యాటకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.
అనూష

