అమరావతి:
అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు ఇకపై పెద్ద సౌకర్యం లభించనుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు తమ గ్రామంలోని కేంద్రాల్లో మాత్రమే పోషణ సరుకులు పొందేవారు. వలస వెళ్ళినా, సరుకులు ఇచ్చే సమయంలో హాజరుకాలేకపోయినా ఆ నెల సరుకులు దక్కకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి.
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘పోషణ్ ట్రాకర్ యాప్’ లో కొత్తగా ‘మైగ్రేషన్ ఆప్షన్’ ను జోడించింది. దీని ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా, దగ్గరలోని ఏ అంగన్వాడీ కేంద్రం నుంచైనా సరుకులు పొందే అవకాశం కల్పించారు.
🔹 ఈ కొత్త సదుపాయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వలస వెళ్ళే కార్మికులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇకపై పోషణ సరుకుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.
👉 లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనూష

