Tv424x7
Telangana

బ్యాంకులో రూ.5 లక్షల నగదు చోరీ…

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో ఉన్న రూ.5 లక్షల నగదును కేవలం 12 ఏళ్ల బాలుడు దొంగిలించాడు.

ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకు ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

చిన్నారి చేతిలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వెళ్లిపోవడం స్థానికులను విస్తుపోయేలా చేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బాలుడి కదలికలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు.

Related posts

సొంత పార్టీ పెడితే.. కవిత ప్రభావం ఎంత ?

TV4-24X7 News

మహబూబాబాద్: జాతీయ రహదారి పై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!

TV4-24X7 News

తెలంగాణలో ఆటో డ్రైవర్ల ధర్నా

TV4-24X7 News

Leave a Comment