ప్రొద్దుటూరు,
ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ (ఐపీఎస్) శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డి.ఎస్.పి. కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సబ్ డివిజన్ సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, క్రైమ్ పార్టీలపై నిఘా తప్పనిసరి చేయాలని ఎస్.పి. ఆదేశించారు. నవరాత్రుల సందర్భంగా మహిళల రాక ఎక్కువగా ఉండే కారణంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా స్వీకరించి, వేగంగా పరిష్కరించాలని సూచించారు.
తరువాత ఎస్.పి. గారు అమ్మవారి శాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సమావేశంలో ప్రొద్దుటూరు డి.ఎస్.పి. పి.భావన, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

