తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ నేటిలోగానే (శనివారం) ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల (సెప్టెంబర్) వేతనం వచ్చే నెల 1న సమయానికి విడుదల కావాలంటే, ప్రతి ఉద్యోగి వివరాలు తప్పనిసరిగా పంపాలని శాఖ స్పష్టం చేసింది. ఇకపై ప్రతినెల పదో తేదీలోగా సంబంధిత వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని కూడా ఆదేశాల్లో పేర్కొంది.
వేతనాల సమయానుసార చెల్లింపుల కోసం ఈ చర్యలు కీలకమని అధికారులు తెలిపారు.

