హైదరాబాద్:
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో కొత్త ఆటో రిక్షాల కొనుగోళ్లకు ప్రభుత్వం మరో నెల గడువు పొడిగించింది.
జీవో నెం. 263 ప్రకారం 65,000 ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సీఎన్జీ, రెట్రో ఫిట్టింగ్ ఆటోల కొనుగోలుకు అవకాశం కల్పించారు.
అయితే ఆటో కంపెనీలు సకాలంలో వాహనాలను సరఫరా చేయకపోవడం, జీఎస్టీ తగ్గింపుతో డ్రైవర్ల సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు 19,000 దరఖాస్తులు రాగా, వాటిలో 18,000కు మంజూరు లభించింది.
డ్రైవర్లకు కొత్త ఆటో కొనుగోళ్లలో అదనపు అవకాశమిచ్చినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

