Tv424x7
Andhrapradesh

… కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుణ్ని హత్య చేసిన మహిళ..

నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో సెప్టెంబర్ 9న చోటుచేసుకున్న ఆవుల శ్రీను (44) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

ఒంటరిగా జీవిస్తున్న శ్రీనుకు పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల ఆ మహిళ మరో వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకోవడంతో ఇరువురి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి.

పాత సంబంధాన్ని అడ్డుగా భావించిన ఆ మహిళ కొత్త ప్రియుడితో కలసి కుట్ర పన్ని, శ్రీనును అతని ఇంటి వరండాలోనే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది.

పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

Related posts

సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

TV4-24X7 News

రక్తదానం ప్రాణదానంతో సమానం మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్

TV4-24X7 News

జీవిత ఖైదీకి బంగారు పతకం – స్ఫూర్తిదాయక గాథ

TV4-24X7 News

Leave a Comment