కాగజ్నగర్ మండలం చింతగుడా సమీపంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం జార్ఖండ్ నుంచి వచ్చిన వలస కార్మికుడు జగత్ రామ్ కుటుంబం రైల్వే ట్రాక్పై ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటనలో భార్య స్వప్న సూర్యవంశీ (26) మరియు మూడేళ్ల కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. జగత్ రామ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు మరియు వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గ్రామంలో ఈ సంఘటనతో తీవ్ర విషాదం అలుముకుంది.

