Tv424x7
Andhrapradesh

నంద్యాలో టీడీపీ అరాచకం: వైయస్సార్ నేతలపై ఘాతుకర దాడులు

నంద్యాల జిల్లా, బనగానపల్లె నియోజకవర్గం:

కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో వైయస్సార్ పార్టీ నాయకులపై తీవ్ర దాడులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రామ సుబ్బారెడ్డి పై ఇటీవల జరిగిన దాడి మరవకముందే, ఈసారి బ్రహ్మం, సుధాకర్ రెడ్డి, గుర్రప్ప, శ్రీను తదితరులు (మొత్తం ఆరు మంది) రాడ్లు, కట్టెలతో దాడికి గురయ్యారు.

దాడిలో మహిళలు కూడా ముప్పు గడపగా, బాధితులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బాధితులను పరామర్శించారు.

స్థానికుల సమాచారం ప్రకారం, సర్పంచ్ ఎన్నికల దగ్గరపడటంతో టీడీపీ నాయకులు గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టిస్తూ, వైయస్సార్ పార్టీకి చెందిన మహిళలతో అసభ్య ప్రవర్తన చేస్తున్నారు. స్థానికులు ఈ దాడులు కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు.

Related posts

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి

TV4-24X7 News

దౌర్జన్యంగా భూములు కాజేయాలనుకుంటే ఊరుకోం – వాల్మీకి సేవాదళ్ బుల్లెట్ లింగమయ్

TV4-24X7 News

Leave a Comment