నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, జివ్విగూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కామినేని విద్యాపీఠ్ స్కూల్ విద్యార్థులు స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లగా, లోతైన బావిని మార్చి పూల్గా మార్చడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
స్విమ్మింగ్కు 13 మంది విద్యార్థులు వెళ్లగా, లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇద్దరు మునిగి మృతి చెందారు. మృతులను రిషిక్ (17) మరియు పోలోజు హర్షవర్ధన్ (17)గా గుర్తించారు.
ప్రాంత పోలీస్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, విద్యార్థుల కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తున్నారని తెలిపారు.

