Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు

ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొందరు వైకాపా కార్యకర్తలను స్టేషన్‌కు పిలిచి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తను స్టేషన్‌ నుంచి రాచమల్లు బలవంతంగా తీసుకెళ్లారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Related posts

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

TV4-24X7 News

ధర్మవరం లో వ్యక్తి దారుణ హత్య

TV4-24X7 News

గ్రూప్‌ అడ్మిన్‌లకు ప్రభుత్వం హెచ్చరిక!

TV4-24X7 News

Leave a Comment