ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల తో చంద్రబాబు సమావేశం. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ – 2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశాలు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం.రేపు సాయంత్రం అమరావతి రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్ల పై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారు. ఈసీ, పోలీసులు తీరుపై అందుకే విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

previous post
next post