విశాఖపట్నం శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని సర్కిల్ ఇన్స్పెక్టర్ దేముడుబాబు తెలిపారు. శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక శక్తుల ఆగడాలకు అవకాశం లేకుండా నిరంతర పర్య వేక్షణ చేపడతామన్నారు. అల్లూరి జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ విధుల్లో ఉన్న సీఐ భాస్కరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.
