Tv424x7
Andhrapradesh

చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ…! ఎప్పుడో తెలుసా….?

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశామని ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

👉 చివరి విడతలో భాగంగా 9 జిల్లాల్లో సెప్టెంబర్ 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు.

👉 ఈ కార్డుల్లో మార్పులు, చేర్పులు అక్టోబర్ 31 వరకు ఉచితంగా చేసుకోవచ్చు.

👉 లబ్ధిదారులు పొరపాట్లు గమనించిన పక్షంలో గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

👉 సరిచేసిన తర్వాత కార్డులు పూర్తిగా ఉచితంగా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అనూష

Related posts

ఏపీలో అపార్ గుర్తింపు 62 శాతం పూర్తి

TV4-24X7 News

భర్తకు భారం కాకూడదనీ.. 13వ ఫ్లోర్‌ నుంచి దూకేసిన తల్లీకొడుకు..! కన్నీరుపెట్టిస్తున్న సూసైడ్ నోట్‌!

TV4-24X7 News

దీపావళికి టిడ్కో ఇళ్లు పంపిణీ – మంత్రి నారాయణ

TV4-24X7 News

Leave a Comment