రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశామని ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
👉 చివరి విడతలో భాగంగా 9 జిల్లాల్లో సెప్టెంబర్ 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు.
👉 ఈ కార్డుల్లో మార్పులు, చేర్పులు అక్టోబర్ 31 వరకు ఉచితంగా చేసుకోవచ్చు.
👉 లబ్ధిదారులు పొరపాట్లు గమనించిన పక్షంలో గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
👉 సరిచేసిన తర్వాత కార్డులు పూర్తిగా ఉచితంగా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అనూష

