Tv424x7
Telangana

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…!

తొగుట:

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు విద్యార్థులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అధికారులు విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల దుష్పరిణామాలు గురించి వివరించారు. అదేవిధంగా గుడ్ టచ్–బాడ్ టచ్, ఈవ్ టీజింగ్, గంజాయి–డ్రగ్స్ ముప్పు పై అవగాహన కల్పించారు.

“అపరిచితుల ఫోన్ కాల్స్‌కు స్పందించకూడదు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనబడే వారిని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని సిఐ లతీఫ్ విద్యార్థులను అప్రమత్తం చేశారు.

షీటీమ్ ప్రాముఖ్యత, స్నేహిత మహిళా సెంటర్‌లో అందించే సేవలు, కౌన్సిలింగ్ విధానం గురించి వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

అనూష

Related posts

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

TV4-24X7 News

తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరు? రేసులో ముందున్న శివధర్‌రెడ్డి!

TV4-24X7 News

రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

TV4-24X7 News

Leave a Comment