Tv424x7
Andhrapradesh

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

రాష్ట్రంలో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అమరావతిని కేంద్రంగా చేసుకుని ప్రత్యేక అర్బన్‌ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.

👉 గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వచ్చాయి.

👉 ఈ పరిస్థితిని సరిచేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం ప్రారంభించింది.

👉 ప్రజల వినతులు స్వీకరించడానికి జిల్లాల కలెక్టర్లు ముందడుగు వేశారు. ఇప్పటికే అనేక అర్జీలు అందినట్లు సమాచారం.

👉 ఉపసంఘం అందిన ప్రతిపాదనలన్నింటినీ సమీక్షించి, అసెంబ్లీ సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించనుంది.

👉 జనగణన షెడ్యూల్ దృష్ట్యా, కొత్త జిల్లాల ఏర్పాటు 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 మధ్యలోనే అమలు కావచ్చని తెలుస్తోంది.

Related posts

వైయస్సార్ చేయూత… నాల్గవ విడత మెగా చెక్కులను విడుదల చేసిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

TV4-24X7 News

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

రూ.4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

TV4-24X7 News

Leave a Comment