ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
ఉచిత బస్సు పథకం మరోసారి వివాదాలకు కారణమైంది.
పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు బయలుదేరిన బస్సులో సీట్ల కోసం మహిళలు తీవ్రంగా ఘర్షణకు దిగారు.మాటలతో మొదలైన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి, మహిళలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లతో దాడి చేసుకున్నారు. బస్సులో ఉన్న పురుషులు గొడవలు ఆపాలని ప్రయత్నించినా, మహిళలు పట్టించుకోకపోవడంతో నందిగామ వరకు కలహం కొనసాగింది.
ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉచిత బస్సు పథకం సద్వినియోగం కాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

