ఆసిఫాబాద్లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలంలోని వంకులం గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ అన్నరావు అక్కడికక్కడే మృతి చెందగా, తిరుపతి కృష్ణ కుమార్ తీవ్ర గాయాల పడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, క్షతగాత్రులను వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు.

