Tv424x7
PoliticalTelangana

నగరంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు వివాదం… ఏంటో తెలుసా…

లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో విజయదశమి శుభాకాంక్షలతో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను హైడ్రా సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ…“ప్రభుత్వం ఆదేశాలు అందరికీ ఒకటే కదా? ముందు కాంగ్రెస్, బీజేపీ నాయకుల బ్యానర్లు తీసేయాలి.

ఎందుకు కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలనే లక్ష్యంగా చేస్తున్నారు?” అంటూ నిలదీశారు.

హైడ్రా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చగా, పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

|| ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా ||

TV4-24X7 News

కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

TV4-24X7 News

గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం

TV4-24X7 News

Leave a Comment