లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో విజయదశమి శుభాకాంక్షలతో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను హైడ్రా సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ…“ప్రభుత్వం ఆదేశాలు అందరికీ ఒకటే కదా? ముందు కాంగ్రెస్, బీజేపీ నాయకుల బ్యానర్లు తీసేయాలి.
ఎందుకు కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలనే లక్ష్యంగా చేస్తున్నారు?” అంటూ నిలదీశారు.
హైడ్రా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చగా, పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

