Tv424x7
Andhrapradesh

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ..


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ CEOకి లేఖ రాశారు.

బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆస్పత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే.. NTR వైద్య సేవ కింద OP సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఏపీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆస్పత్రులు వెనక్కు తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్‌ నిర్ణయం తీసుకున్నాయి నెట్‌వర్క్ ఆస్పత్రులు.

ఇటు తెలంగాణలోనూ ఇవాళ మంగళవారం (సెప్టెంబర్ 15) అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా EHS, JHS బకాయిలు ఇవ్వలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.

Related posts

ఒరిస్సా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు

TV4-24X7 News

ఫేక్ వీడియోల ద్వారా ప్రభుత్వంపై దృష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

TV4-24X7 News

రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

TV4-24X7 News

Leave a Comment