న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ కార్యాలయాలు, కేంద్ర స్థాయిలో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, పేదలకు భోజన విందులు ఏర్పాటు చేశారు. గుజరాత్లో మోదీ స్వగ్రామం వడ్నగర్లో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సోషల్ మీడియాలోనూ ‘#HappyBirthdayModi’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ లక్షలాది మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధానిగా మోదీ తీసుకుంటున్న సంకల్పాలు, అభివృద్ధి పథకాలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని పలువురు నేతలు అభినందించారు.

